అనారోగ్యం తో బాధపడుతున్న గల్ఫ్ కార్మికున్ని ఇంటికి చేర్చిన గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక

Published: Monday May 10, 2021
కథలాపూర్, మే 09 (ప్రజా పాలన ప్రతినిధి) : తక్కలపెల్లి గ్రామానికి చెందిన దేశవేని రమేష్ సౌదీ అరేబియాలో పక్షవాతంతో బాధపడుతున్నడగా, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో ఈ విషయం గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థకు తెలియగానే. ఇంటికి పంపించేందుకు సభ్యులు  విరాళాలు సేకరించి విమాన టికెట్ సమకూర్చారు. నిరుపేద గల్ఫ్ కార్మికుడిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సౌదీ అధ్యక్షుడు బడుగు లక్ష్మణ్   తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం తెలియజేశాడు.