కోరుట్ల పురపాలక సంఘము అధ్వర్యంలో వినూత్న ప్రచారం
Published: Saturday January 29, 2022
కోరుట్ల, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి): అజాది కా అమృత్ మహోత్సవ్ స్వచ్ఛ సర్వెక్షన్ 2022 లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలపై కోరుట్ల పురపాలక సంఘము వినూత్న ప్రచారం నిర్వహించింది. గురువారం సాయత్రం అంబేద్కర్ చౌరస్తా లో ఎల్ఈడీ తెర ఏర్పాటు చేసి పరిసరాల పరిశుభ్రత, సఫాయిమిత్రాలో చేపట్టిన కార్యక్రమాలు, దక్కించుకున్న అవార్డులు దృశ్య రూపంలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ ప్రజలు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు
Share this on your social network: