షటిల్ టీం విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

Published: Tuesday December 13, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 
 
క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు,  మండల స్థాయి లో రేగా యూత్ ఆధ్వర్యంలో సారపాక బ్రిలియంట్ స్కూల్లో గత మూడు రోజులుగా ఖాదర్ మరియు టీం  ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్  నిర్వహించడం జరిగినది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బూర్గంపాడు జడ్పిటిసి కామిరడ్డి శ్రీలత  బహుమతులు ప్రధానం చేయడం జరిగింది, ప్రధమ బహుమతి (రూ,10000) & షిల్డ్  సుధా టీమ్  మణుగూరు గెలుచుకోవడం జరిగినది.ద్వితీయ బహుమతి ( రూ 5000) &  షిల్డ్  శ్రీకాంత్ టీమ్ మణుగూరు వారికీ, బహుమతులను మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  చేతులమీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్  బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను ,   బిఆర్ఎస్  యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని ,  సీనియర్ యూనియన్  నాయకులు గోనే దారుగా ,   సాని కొమ్ము శంకర్ రెడ్డి , బిఆర్ఎస్  సీనియర్ నాయకులు  బెల్లంకొండ రామారావు , బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బిట్ర సాయిబాబు, చుక్కపల్లి బాలాజీ, బిజ్జంకి కనకచారి, భూక్యా కృష్ణ, పంగి సురేష్, ఈశ్వర్, ప్రసాద్, భద్రు, నాగ్ రవి, శివరామకృష్ణ, నవీన్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..