జిల్లా ఉపాధ్యక్షుడిగా చిలువేరి నరసయ్య నియామకం

Published: Thursday January 19, 2023

జన్నారం, జనవరి 18, ప్రజాపాలన: మండల కేంద్రానికి చెందిన చిలువేరి నరసయ్య మంచిర్యాల జిల్లా మహేంద్ర సంఘం ఉపాధ్యక్షుడిగా నియమకమయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహేంద్ర సంఘం సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో మహేంద్ర సంఘం కమిటీలు వేసి ఆ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. జిల్లా మండల గ్రామాలలో మహేంద్ర సంఘం సభ్యులు ఐక్యంగా పోరాటం చేసి తమ జీవన ఆకులను సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర సంఘం రాష్ట్ర, జిల్లా, నాయకులు పాల్గొన్నారు