కల్యాణలక్ష్మీ షాదీముబారక్ చెక్కుల పంపిణీ

Published: Friday June 18, 2021
మేడిపల్లి, జూన్17 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్లోని కేకేఆర్ గార్డెన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తహసీల్దారు కె.గౌతమ్ కుమార్, ఉప్పల్ కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి, రామంతాపూర్ కార్పొరేటర్ శ్రీవాణివెంకట్ రావు అర్హులైన 189 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రామంతాపూర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సుంకురి కుమారస్వామి, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, అల్వాల భాస్కర్ మంద మురళీకృష్ణ రెడ్డి, అలుగల అనీల్ కుమార్, జనగం రామకృష్ణ, ప్రశాంత్ రెడ్డి, గొరిగ మహేష్, హనుమంతు, రాఘవేంద్ర, బూత్కూరి మదన్ గౌడ్, ఢిల్లీ చంద్ర శేఖర్ రెడ్డి, జిత్తు రెడ్డి, కన్నమైన నరేష్, తదితరులు పాల్గొన్నారు.