పలు కుటుంబాలను పరామర్శించిన ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు డా.కోట రాంబాబు

Published: Saturday February 25, 2023

మధిరఫిబ్రవరి 25 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ  పరిధిలోమొదటిగా గాంధీనగర్ కాలనీ నందు పాస్టర్ రాజారత్నం అనారోగ్యంతో ఉండగా వారిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని పరీక్షించి వారు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. వైద్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అండగా ఉంటాను అని ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు.అనంతరం సలీంద్ర వెంకటజలం కుమార్తె ఉష అనారోగ్యంతో ఉండగా ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి ఆర్థిక సహాయం అందించారు.

రాంబాబు వెంట కిలారు మనోహర్ సీతారామయ్య కొండపల్లి శేఖర్ రెడ్డి గోగుల శ్రీను బోరుగడ్డ లక్ష్మీనారాయణ వార్డు మెంబర్ పిట్టల రవికిరణ్ నాగేశ్వరావు చల్లా వెంకటేష్ రామలింగయ్య అచ్చయ్య రమేష్  గొడుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.