కామన్వెల్త్ గేమ్స్ మహిళల 50 కిలోల బాక్సింగ్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను అభినందించ
Published: Thursday August 25, 2022
కామన్వెల్త్ గేమ్స్- 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో అభినందించారు.
ఎమ్మెల్సీ కవిత తనను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారని, దాంతో సీఎం కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని నిఖత్ గుర్తు చేసుకున్నారు. దాంతోపాటు, అదనంగా రూ.2 కోట్లు మంజూరు చేయడం మరియు నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్ గారికి నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలవడం గర్వకారణమని, ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
నిఖత్ జరీన్ తో పాటు స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు..
Share this on your social network: