సారంగాపూర్ లో రైతు వేదిక క్లస్టర్ భవనం ప్రారంభం...

Published: Saturday February 20, 2021

సారంగాపూర్, ఫిబ్రవరి 18 (ప్రజాపాలన): సారంగాపూర్ మండలంలోని కొనాపూర్ సారంగాపూర్ గ్రామాల్లో రైతు వేదికలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు అందరు సమూహంతో కలిసి కట్టుగా మాట్లాడుకునే మంచి వేదిక అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ జి. రవి జిల్లా వ్యవసాయాధికారి సురేష్ ఎంపీపీ కోల జమున జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి తహశీల్దార్ శ్రీలత ఎంపీడీవో పుల్లయ్య మండల వ్యవసాయ  అధికారి తిరుపతి నాయక్ సర్పంచులు ఆకుల జమున బొడ్డుపల్లి రాజన్న గుర్రాల రాజేందర్ రెడ్డి ఎంపీటీసీలు జోగినపల్లి సుధాకర్ రావు ఏలేటి మమత మనాల ప్రసన్న మాల  సొల్లు సురేందర్ బుక్య లావణ్య ప్యాక్స్ చైర్మన్స్ గుర్నాథమ్ మల్లారెడ్డి ఏలేటి నరసింహా రెడ్డి రైతు సమన్వయ మండల్ కన్వీనర్ కోలా శ్రీనివాస్ సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు నాయకులు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.