9వ వార్డులో మూడవ విడత పట్టణ ప్రగతి

Published: Monday July 05, 2021
పరిగి, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపల్ పరిధిలో ఆదివారం మూడవ విడత పట్టణ ప్రగతి - హరితహారం లో భాగంగా స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ 9వ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వార్డుల్లో పురాతన శిధిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చడం, ఎలక్ట్రిక్ స్తంభాలను తొలగించడం, ఇంటింటికి చెత్తను వేరు చేయుట, శ్రమదానం, పొదలను తొలగించుట, రోడ్ల పక్కన చెట్లను పనులు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ మూడవ వార్డు,13వ వార్డులలో పనులను పరిశీలించారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ అరవింద రావు మండలాధ్యక్షులు ఆంజనేయులు తెరాస సీనియర్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సురేందర్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు హఫీజ్, వార్డు కౌన్సిలర్స్ శబ్బనూర్ రియాజ్ వేముల కిరణ్, మునీర, బి రవి కుమార్, ఎర్రగడ్డ పల్లి కృష్ణ ఆయా కాలనీ స్పెషల్ ఆఫీసర్లు మహేష్, వేణు, ఖాదిర్, నాయకులు నరేష్ యాదవ్, దోమ శ్రీశైలం, బాల్ నగర్ బాబయ్య, యాదయ్య, రాజు, ఆనంద్, ఆయా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.