పట్టణ ప్రగతిలో సమస్యలపై సమావేశం మేడిపల్లి, జూన్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)
Published: Tuesday June 07, 2022
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గుర్రాల రమ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ సమావేశానికి ముఖ్య అతిథులుగా మేయర్ సామల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో 4వ విడుత పట్టణ ప్రగతిలో చేపట్టవలసిన పనులు సమస్యలపై కాలనీ వాసులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ మమత, శానిటరీ ఇన్స్పెక్టర్ జాన్ పాల్,
ఆయా కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: