పల్లె ప్రగతి లో శ్రమదానం, సర్పంచ్ మెతుకు స్వరూప స్వామి.

Published: Thursday June 09, 2022

వెల్గటూర్, జూన్ 08 (ప్రజాపాలన ప్రతినిధి) :  వెల్గటూర్ మండలం గోడిశలపెట  గ్రామంలో  పల్లె ప్రగతి లో భాగంగా ప్రభుత్వ పాఠశాల వద్ద సర్పంచ్ మెతుకు స్వరూప స్వామి ఆధ్వర్యంలో బుధవారం శ్రమదానం నిర్వహించారు. పాఠశాల వద్ద పిచ్చి మొక్కలను తొలగించి చెన్నకేశవ స్వామి దేవాలయం వరకు రహదారికి ఇరువైపులా జె.సి.బి సహాయంతో చెట్లను తొలగించి, గుంతలను పూడిచారు. మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు కవిత దేవేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలతో కలిసి శ్రమదానం నిర్వహించారు. విద్యా కమిటీ చైర్మన్ శంకరయ్య, పాలకవర్గ సభ్యులు, సొసైటీ నెంబర్ రాజేందర్, అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు,  మహిళ సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.