ఆర్థిక సహాయాన్ని అందించిన నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు

Published: Friday June 25, 2021

బెల్లంపల్లి, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఓ నిరుపేద కుటుంబానికి నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఆ సంఘం నాయకులు దుర్గం గోపాల్ తెలిపారు. గురువారం నాడు ఆయన మాట్లాడుతూ కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన జాడి సాగర్ రాజేశ్వరి ల కూతురు శైలజ వివాహం ఈ నెల 20న జరుగగా తండ్రిసాగర్ కొద్దిరోజుల క్రితమే మరణించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం గోపాల్, ఉపాధ్యక్షుడు జాడీ రామచందర్, కాసిపేట మండల అధ్యక్షుడు రామ్టెంకి వాసుదేవ్, జిల్లా కార్యదర్శి గోనె రవీందర్, దుర్గం శంకర్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.