ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీ, ఉపాధ్యక్షుడు కేశవ్ రావు

Published: Friday June 17, 2022

ఈనెల 18న మాదిగల సంగ్రామ యాత్రఆసిఫాబాద్ జిల్లా జూన్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈనెల 18న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాదిగల సంగ్రామ యాత్రను నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్, ఎంఎస్సీ, జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ రావు మాదిగ పిలుపునిచ్చారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కేశవ్ రావు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఈనెల 18న మాదిగల సంగ్రామ యాత్రను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే జూలై 2న సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 3న చలో హైదరాబాద్ కార్యక్రమం లో భాగంగా మహాధర్నా విజయవంతం చేయడానికి మాదిగల అందరూ మరో పోరాటానికి సిద్ధం కావాలంటూ సంగ్రామ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసిఫాబాద్ జిల్లా లోని 15 మండలాల లోని ప్రతి మాదిగ వాడకు పాదయాత్ర బృందం వెళ్లి సంగ్రామ యాత్రను జిల్లాలోని మాదిగ జాతి యావత్తు విద్యార్థులు యువకులు ఉద్యోగులు మహిళలు ప్రతి ఒక్క మాదిగ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెస్సీ ఇంచార్జ్ కొండ బ్రహ్మయ్య, రమేష్, సత్యనారాయణ, విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.