మద్దెల శ్రీను ఆలయ అభివృద్ధికి విరాళం* -సమాజ సేవలో కాంగ్రెస్ నేత

Published: Monday December 05, 2022
చేవెళ్ళ,డిసెంబర్‌ 04 (ప్రజాపాలన ):-

చేవెళ్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ తన పెళ్లి రోజును సందర్భంగా ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి, ఆలయ అభివృద్ధిలో  భాగంగా ఫ్లోరింగ్ క్రియలకై 50వేల రూపాయల నగదును దేవాలయ అర్చకులు శ్రీకాంతచార్యులకు అందించారు. అనంతరం శ్రీనివాస్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అదేవిధంగా అయ్యప్ప దీక్ష బూనిన దీక్ష దారులకు భోజన వితరణ చేయడం ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. మునుముందు కూడా సమాజ సేవలో ముందుంటానని తెలిపారు. అనంతరం అర్చకులు, అయ్యప్ప స్వాములు ఆ దంపతులను ఆశీర్వదించి , తీర్థప్రసాదాలు అందించారు.