పట్టణ అభివద్ధే ప్రధాన లక్ష్యం

Published: Tuesday July 06, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్
వికారాబాద్ జూలై 05 ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చైర్ ఫర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా 5వ రోజు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో జరుగుతున్న పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చైర్ పర్సన్ మాట్లాడుతూ..15, 16, 25 వార్డులలో జరుగుతున్న పనులను పరిశీలించి తగు సూచనలు, సలహాలు సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మరో రెండు నూతన ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, రాజ్యలక్ష్మి తదితర నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.