నిరుపేద కుటుంబాలకు అండగా సీఎం సహాయ నిధి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Wednesday April 05, 2023
మధిర ,ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మధిర మండల,పట్టణ పరిధిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు తో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో 8,11,500/- లక్షల రూపాయల విలువ చేసే 22 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేశారు.
నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, పేద, మధ్య తరగతి కుటుంబాల వారు వైద్యం కోసం ఆర్దిక ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహృదయం తో ఆలోచించి సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు..మంగళవారం నాడు మధిర మండల పరిథి వివిధ గ్రామాల సీఎం సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు దీనితో వేలాది కుటుంబాలకు బీఆర్ఎస్ సర్కారు భరోసా కల్పించిందని ఆయన తెలిపారు..పలు అనారోగ్య సమస్యలతో వివిధ రకాల హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ వారికి అయిన ఖర్చులను ఇప్పించి ఆదుకోవాలని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందిస్తున్నారన్నారు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వేల మందికి ఎక్కడో ఒకరికి మాత్రమే వచ్చేవని కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర సర్కారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు..పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ గారు ‌పెద్దపీట వేస్తున్నారని ఆయన గుర్తు చేశారు...ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు ,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, టౌన్ కార్యదర్శి శ్రీనివాస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరు శ్రీను, కనుమూరు వెంకటేశ్వరరావు ,భాస్కర్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.