1.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి మల్లారెడ్డి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Monday June 07, 2021
మేడిపల్లి, జూన్ 6 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 1.70 కోట్లతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఆయా డివిజన్ల స్థానిక కార్పొరేటర్లతో కలిసి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ బీబీ సాహెబ్ మక్తాలో మున్సిపల్ సాధారణ నిధులు 14.00లక్షల వ్యయంతో హెచ్ఎండిఎ పార్క్ ప్రహరీ గోడ శంకుస్థాపన మరియు 24.55లక్షల వ్యయంతో సి.సి రోడ్డు ప్రారంభోత్సవం. 24వ డివిజన్ మారుతీ నగర్ కాలనీ యందు మున్సిపల్ సాధారణ నిధులు 40.00 లక్షల వ్యయంతో పార్క్ ప్రారంభోత్సవం. 17వ డివిజన్ మారుతీ నగర్ కాలనీ యందు మున్సిపల్ సాధారణ నిధులు 14.00లక్షల వ్యయంతో భూగర్భ మురికి కాలువ శంకుస్థాపన. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ నిధులు 30.00లక్షల వ్యయంతో 5 స్వచ్ ఆటోల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు టీఆర్ఎస్ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు లేతాఆకుల మాధవి రఘుపతి రెడ్డి, అనంత రెడ్డి, మహేష్, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పప్పుల అంజిరెడ్డి, బండి సతీష్ గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, డివిజన్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు,కాలనీల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.