కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

Published: Thursday January 27, 2022

వైరా ప్రజాపాలన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 73 వ గణతంత్ర వేడుకలను వైరా మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు వైరా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోతు రామదాసు నాయక్ అధ్యక్షుడు కార్యాలయం పై జాతీయ జండను ఎగురవేసి.. వందన సమర్పణ చేశారు.. ఈ సందర్భంగా మాలోతు రామాదాస్ నాయక్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు నుండి మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు బాపూజీ నాయకత్వంలో అనేక మంది దేశ నాయకులు మరియు ప్రజలు 1857 నుండి బ్రిటీష్ పాలనపై జరిపిన సుదీర్ఘ పోరాటాలు మరియు త్యాగాల ఫలితమే. అందరికీ సమాన హక్కులు - అవకాశాలతో తయారుచేసిన మన రాజ్యాంగ ప్రతిని 1950 జనవరి 26న ఆమోదించడం జరిగింది. ఆ రోజు నుండి రిపబ్లిక్/గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ మహోద్యమకారులందరికీ నివాళులు అర్పించి - ఎల్లవేళలా మన దేశాన్ని కాపాడుచున్న సైనికులను అభినందిస్తూ కరోనా నిబంధనలు పాటించుచూ నేడు 73 వ గణతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరువుకోవాలి అని అన్నారు.... ఈ కార్యక్రమంలో వీరయ్య చౌదరి 2 వార్డు కౌన్సిలర్ బత్తుల గీత పొదిలి హరినాద్ గొల్లపూడి కృష్ణారావు బోళ్ళ గంగారావు పల్లపు కొండలరావు వాడపల్లి రామారావు పువ్వాళ్ళ రాము బత్తుల శ్రీనివాస్ ఏదునూరి శ్రీను కుమార్ బాబు రాకేష్ గోపీ వీరబాబు కొండ మొదలగు వారు పాల్గొన్నారు