ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Published: Tuesday September 06, 2022
మధిర సెప్టెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ప్రధాన ఉపాధ్యాయులు దయాల్ మాటారు హైస్కూల్ గణిత ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావుని సోమవారం మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆవుల సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ, పళ్ళపోతుల ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మైనీడి పూర్ణచంద్ర రావు, ప్రచార కార్యదర్శిలు చుక్కా రాంబాబు, లింగంపల్లి అప్పారావు, చలవాది రాజశేఖర్ ల ఆధ్వర్యంలో దుశ్యాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ మధిర స్విమ్మర్స్ అసోసియేషన్లో సభ్యులుగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మరియు రిటైర్డ్ అయిన గౌరవ సహాదారులు ఆదూరి అబ్రహం ప్రచార కార్యదర్శి లింగంపల్లి అప్పారావు, కార్యవర్గ సభ్యులు షేక్ జానీ, షేక్ మహమ్మద్, లూఖ్య, కె నరేష్, లెక్చరర్లు మునగల తిరుపతి రెడ్డి, గడ్డమణుగు రామారావు లను కూడా ఘనంగా సన్మానించారు. తదనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభాకర్ రావుని దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వట్టే సైదులు, చింతల అప్పారావు, సభ్యులు బజాజ్ సాంబి రెడ్డి, మేకల ఉపేంద్ర , ఊటుకూరి భాస్కర్ రావు, కొత్తూరు నర్సింహారావు, పాములపాటి శ్రీనివాసరెడ్డి, గొర్రెముచ్చు రమేష్, చలువాది వరుణ్ నాగేశ్వరరావు మరియు స్విమ్మర్స్ సభ్యులు పాల్గొన్నారు.