జంట కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతి

Published: Wednesday August 25, 2021
మేడిపల్లి, ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో పలు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కార్మిక,ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్యులు, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షులు కేటీఆర్ ను కోరారు. ఈ మేరకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారని మేయర్లు తెలిపారు. కేటీఆర్ ను కలిసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి ఉన్నారు.