ఎండిఓ కార్యాలయంలో 74 వ గాంధీ వర్ధంతి వేడుకలు.....

Published: Monday January 31, 2022
ఎర్రుపాలెం జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి: జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎండిఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత. అనంతరం వారు మాట్లాడుతూ గాంధీజీ నిరాడంబరుడు, వృత్తి విద్య లను ప్రోత్సహించాడు. సత్యం అహింస శాంతి ఉత్తమ మార్గాలు అని దృఢంగా నమ్మి ఆదరించిన మహనీయుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, యూ డి సి వేణు, మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పంబి సాంబశివరావు, సర్పంచి మొగిలి అప్పారావు, సర్పంచ్ పురుషోత్తం రాజు, గొల్లపూడి వెంకటేశ్వర రావు, ఎస్సీ సెల్ ఇన పనూరి భాస్కర్, షేక్ హుస్సేన్, దేవరకొండ చిరంజీవి, పల్లెకంటి సుధీర్, తుపాకుల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.