శిక్షణను సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Tuesday May 31, 2022
బెల్లంపల్లి మే 30 ప్రజా పాలన ప్రతినిధి: నిరుద్యోగులుగా ఉన్న మీరందరూ శిక్షణా కార్యక్రమాన్ని  సద్వినియోగం చేసుకొని అధిక  సంఖ్యలో ఉద్యోగాలు పొందాలని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం నిరుద్యోగ యువతి, యువకులకు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో  స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా శిక్షణార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, ఎలా ప్రయత్నించాలి, ఎలాంటి అంశాలపైన చదవాలి, ఉద్యోగం పొందే లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, అనే అంశాల పై దిశానిర్దేశం చేశారు.అనంతరం శిక్షణ పొందుతున్న యువతీ, యువకులకు, ఎమ్మెల్యే చిన్నయ్య, ఆయన సతీమణి జయతార, కూతురు నిహారిక, స్వయంగా భోజనాలు వడ్డించి వారితో పాటే కలిసి  భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్  చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు రమేష్ , సురేష్ , అఫ్సర్ , రాము నాయక్ , కో ఆప్షన్ సభ్యుడు వెంకటేష్ , ఇతర ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ టిఆర్ఎస్  యువజన అధ్యక్షుడు మహేష్ గౌడ్ , పట్టణ పార్టీ యువజన అధ్యక్షుడు సన్నీబాబు , నాయకులు భీమగౌడ్ , శ్రావణ్ , శ్రీనివాస్ , వెంకటేష్ , అభినవ సంతోష్ , తదితరులు పాల్గొన్నారు .
 
 
 
Attachments area