స్వయం పరిపాలన దినోత్సవం చేవెళ్ల నియోజకవర్గం: చేవెళ్ల :(ప్రజాపాలన):
Published: Thursday December 01, 2022
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల కౌకుంట్ల గ్రామంలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు డీఈవోగా ఐశ్వర్య, ప్రధానోపాధ్యాయులుగా మాధవ్ మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు, ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో
Share this on your social network: