బండి సంజయ్ యాత్రలో హనుమంతుడి వేషాధారణతో ఆకట్టుకున్న గోపి

Published: Tuesday September 07, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర‌లో శేరిలింగంప‌ల్లికి చెందిన క‌ళాకారుడు హ‌నుమంతుడి వేష‌ధార‌ణలో సంద‌డి చేశారు. పీఏ న‌గ‌ర్‌లో నివాసం ఉండే గోపినాయ‌కుడు వృత్తి రిత్యా డ్యాన్స్ మాస్ట‌ర్‌.  అదేవిధంగా ర‌వికుమార్ యాద‌వ్‌(ఆర్‌కేవై) టీం స‌భ్యుడిగా స్థానికంగా సేవా కార్య‌క్ర‌మాల‌లో చురుకుగా పాల్గొంటుంటాడు. కాగా ప్ర‌జా సంగ్రామ యాత్ర ఆదివారం వికార‌బాద్ జిల్లాలో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో గోపినాయుడు హ‌నుమంతుడి వేష‌దార‌ణ‌లో యాత్రికుల‌ను ఆక‌ట్టుకున్నారు. ర‌వికుమార్ యాద‌వ్ గోపిని బండి సంజ‌య్‌, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. హ‌నుమంతుడి రాక‌తో ప్ర‌జా సంగ్రామ యాత్రలో బిజెపి శ్రేణుల ఉత్సాహం రెట్టింప‌య్యిందని బీజేపీ నాయకులు గోపి ని అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయ‌కులు రాచ‌మ‌ళ్ల నాగేశ్వ‌ర్‌ గౌడ్‌, ఆకుల ల‌క్షణ్ ముదిరాజ్‌, కురుమ సూర్ణ శ్రీశైలం  త‌దిత‌రులు పాల్గొన్నారు.