అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యం కోసం బహుజనులంతా ఏకం కావాలి.

Published: Wednesday April 27, 2022
ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 25, ప్రజాపాలన: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యం కోసం బహుజనులంతా ఏకం కావాలని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ అన్నారు. మంగళవారం నస్పూర్ లో ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్త్ర అధ్యక్షులు తాడెం రాజ్ ప్రకాష్ తో కలిసి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో పలువురు చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, బహుజనుల హక్కులు కాలరాస్తున్నాయని, రాజ్యాధికారంలో మన హక్కుల కోసం అందరూ ఏకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కోశదికారి తోట నరసింహులు, జాతీయ క్రమశిక్షణ అధ్యక్షులు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, జాతీయ కార్యనిర్వహణ కార్యదర్శి పాలమకుల మధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగు రామచెంద్రు, రాష్త్ర యువబంధు అధ్యక్షులు మైసంగారి సునీల్, పెద్దపల్లి పార్లమెంటరీ అధ్యక్షులు గడ్డం సత్య గౌడ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సురేష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బోల్ల మధుకర్, మంచిర్యాల జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ జానీ, జిల్లా సెల్ మైనారిటీ ఉపాధ్యక్షులు హజి పాష  మహిళా యువ బంధు అధ్యక్షురాలు కొంకటి జ్యోతి కుమ్మరి రాజేష్, థామస్, శ్రీనివాస్ గౌడ్, కలిం, కళ్యాణ్, కోంకటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.