రాబోవు ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించాలి

Published: Wednesday February 22, 2023
* టిపిసిసి సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన : రాబోవు ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించాల్సి ఉందని టిపిసిసి సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని సాకేత్ నగర్ లో గల మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, నియోజకవర్గ కో ఆర్డినేటర్ లు చురుకుగా కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్క సోషల్ మీడియా నాయకుడి పై ఉందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు ఎత్తి చూపే విధంగా సోషల్ మీడియా పనిచేయాలని హితవు పలికారు. సామాజిక మధ్యమాల్లో చురుకుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు చామల శ్రీనివాస్ ముదిరాజ్, ఆశ్రఫ్ అలీ, సిద్దయ్య ముదిరాజ్, అజీమ్, నర్సింగ్, నరేందర్, మహేందర్, గౌస్, నందు తదితర నాయకులు పాల్గొన్నారు.