లఖింపూర్ రైతుల ఘాతుకంకు నిరసనగా మౌనదీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్.
Published: Wednesday October 13, 2021
హైదరాబాద్, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులను వాహనంతో తొక్కించి వారి మరణానికి కారణమైన విషయం తెలిసిందే. నిందితులను శిక్షించాలని గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ లో కూడా రోజుకో విధంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో బాగంగా సోమవారం నాడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన మౌన దీక్షలో పాల్గొన్న పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మరియు యాదాద్రి భువనగిరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి లు మొదలగు వారు పాల్గొన్నారు.
Share this on your social network: