టీఆర్ఎస్లో పలువురి చేరికలు...
Published: Monday June 20, 2022
ప్రజాపాలన, కొడంగల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ యువ నాయకుడు టి.సాయిలు అన్నారు. గురువారం కొడంగల్ మండల పరిధిలోని చిన్న నందిగామ బుర్జీఖాన్ పల్లి గ్రామాలకు చెందిన దాదాపు మంది కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పార్టీ యువనాయకులు టీ సాయిలు పీఏసీఎస్ డైరక్టర్ సి. వినోద్కుమార్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం కొడంగల్లో జరిగిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సభకు బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: