ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 4ప్రజాపాలన ప్రజాపాలన ప్రతినిధి *రాష్ట్ర ద్వితీయ మహాసభలు జయప్రదం

Published: Monday December 05, 2022

9న జరిగే రాష్ట్ర గీతపనివారల సంఘం బహిరంగ సభను జయప్రదం చేయండి--గీతవనివారల సంఘం జిల్లా అధ్యక్షులు పి రాములుగౌడ్ ప్రజాపక్షం / ఇబ్రహీంపట్నం: నగరంలో ఈ నెల 9న ఉప్పల్ మండలం పిర్జాదిగూడలో జరిగే గీత పనివారల సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షులు పి రాములు గౌడ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓరుగంటి యాదయ్య గౌడ్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఈ నెల 9, 10వ తేదిలలో రాష్ట్ర గీత పనివారల సంఘం 65వ వార్షికోత్సవం సందర్భంగా జరిగే ద్వితీయ బహీరంగా సభ మహాసభలను జయప్రదం చేయాలని గీతవనివారల సంఘం జిల్లా అధ్యక్షులు పి రాములు గౌడ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓరుగంటి యాదయ్యలు ముఖ్య అతిథులుగా హజరై గీత పనివారల సంఘం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 1957వ సంత్సరంలో మాజీ ఎంపి బొమ్మగాని ధర్మభిక్షం సంఘం ను వ్యవస్థాపించినప్పటి నుండి గీత కార్మికుల సమస్యలు, హక్కుల సాధనకై నిశ్వార్ధంతో రాజీ లేని పోరాటం కొన సాగించిందని సూచించారు. ఈ సభలకు ముక్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్. మధు యాష్కీ గౌడ మాజీ ఎంఎల్ఎలు చాడ వెంకట్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, హైకోర్టు న్యాయ వాధి బొమ్మగాని ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, వెంకట్రాములు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు కావున తెలంగాణ రాష్ట్ర నలుమూలాల నుండి గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గోన్ని బహీరంగా సభను, ప్రతినిధుల సభలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు తాళ్ల మహేశ్ గౌడ్, పల్లె లక్ష్మ య్య గౌడ్, ఇబ్రహీంపట్నం అధ్యక్షులు  గుర్జనీ యాదయ్య గౌడ్, మాజీ అధ్యక్షుడు పల్లె లక్ష్మయ్య గౌడ్, గరిగె నర్సింహ్మ గౌడ్, గడ్డం భాస్కర్ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఒడుగుల మధు గౌడ్, బిక్షపతి గౌడ్, మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు,