చందమామ ఫౌండేషన్ కు మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత.

Published: Friday June 11, 2021
పాలేరు, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని చందమామ ఫౌండేషన్ కు పునర్జన్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ను గురువారం తహశీల్దార్ తాళ్లూరి సుమ చేతుల మీదుగా సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో పునర్జన్మ ఆర్గనైజేషన్ వారు అక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించటం చాలా గొప్ప అన్నారు. ఆక్సిజన్ అందించటం అంటే పునర్జన్మ ను అందించటమేనని పేర్కొన్నారు. చందమామ ఫౌండేషన్ సభ్యులు అభాగ్యుల కు అండగా ఉంటున్నారని, వారి ఆకలి తీర్చేందుకు చేస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. ఇప్పటి వరకు 86 మందికి 2900 భోజనాలను ఉచితంగా అందించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పునర్జన్మ ఆర్గనైజేషన్ బాధ్యులు రఘు రాజగోపాల్ కు కృత జ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు డాక్టర్ సూచనతో చందమామ ఫౌండేషన్ సభ్యులను సంప్రదిస్తే కొద్ది రోజుల పాటు ఉచితంగా అందించనున్నట్లు సభ్యులు ప్రకటించారు