దళితబంధు తెచ్చిన సంబురం

Published: Wednesday May 25, 2022

కోరుట్ల, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ రవి మరియు ఆర్డిఓ వినోద్ కుమార్ తో కలిసి మెట్ పల్లి విఅర్ఎం గార్డెన్స్ లో దళితబంధు యునిట్లను  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్  మాట్లాడుతు  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితవాడలు నూతన వ్యాపారవేత్తలను ఆవిష్కరిస్తున్నాయని, సంపద సృష్టికి నిలయాలుగా మారుతున్నాయని నిన్న మొన్నటి దాకా కూలి పని కోసం ఎదురుచూసినవారు ఇప్పుడు తామే మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు.
ఇది దళితబంధు పథకం సాధిస్తున్న అపూర్వ విజయమని దీన్ని దళిత బిడ్డలు సద్వినియోగం చేసుకొవాలని కోరారు.