కోట్లాది మంది ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర అవతరణ : డిసిసిబి డైరెక్టర్ ఇంటూరు శేఖర్..

Published: Thursday June 03, 2021
పాలేరు జూన్ 2 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేగొమ్మ సొసైటీలో సహకార సంఘం అధ్యక్షుడు మరియు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సొసైటీ పరిధిలోని రైతులకు పిల్లిపెసర్లు, జనుములు, జీలుగు విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటూరి శేఖర్ మాట్లాడుతూ కోట్లాది మంది ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రమని దాన్ని సాధించుకున్నమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతును అన్ని విధాలా ఆదుకుంటామని శేఖర్ తెలిపారు. వానాకాలం పంటల సాగుకు రైతులందరు సిద్ధం కావాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన విత్తనాల నే విత్తన దుకాణాల్లో విక్రయించాలని ఆయన అన్నారు. చేగొమ్మ సొసైటీ పరిధిలో ని రైతులకు ఇంకేమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిషరిస్తానని శేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యవర్గ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు