ఆస్పత్రిలో వైద్య పోస్టులు భర్తీ చేయాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు

Published: Wednesday July 14, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై 12, ప్రజాపాలన : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుర్గం దినకర్, గోడిసెల కార్తీక్ లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, పరికరాలు ఉన్నప్పటికీ సంబంధించిన అధికారులు లేక పోవడం బాధాకరమన్నారు. ఆస్పత్రిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, న్యూరో ఫిజీషియన్, ఆర్థోపెడిసియాన్, తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి మల్లేష్, ఇప్ప ప్రసాద్ లు పాల్గొన్నారు.