బెల్లంపల్లి పట్టణ తెరాస బిసి, ఎస్ సి విభాగం అద్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక

Published: Wednesday September 22, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల నిర్వహించిన తెరాస సంస్థాగత ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణం బీసి మరియు ఎస్సీ విభాగాల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. మంగళవారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్  ఆదేశాల మేరకు టీ ఆర్ ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా పార్టీ ఆదేశానుసారం పనిచేస్తున్న దాసరి రమేష్, ను బీసీ విభాగం అధ్యక్షునిగా దామెర కిరణ్ లను, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా కార్యకర్తల ఇష్టం మేరకు పట్టణ అధ్యక్షులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో సంస్థాగతంగా తెరాస పార్టీ కమిటీలకు ఎన్నికైన కార్యకర్తలందరూ అంకిత భావంతో పనిచేస్తూ బెల్లంపల్లిలో తెరాస పార్టీ బలోపేతానికి కంకణ బద్దులై పనిచేస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ పట్టణ అద్యక్షుడు బొడ్డు నారయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టిఆర్ ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అద్యక్షులు బడికల శ్రావణ్, కన్నపెల్లి జడ్పీ టిసి సత్యనారాయణ, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ నూతన అద్యక్షుడు జి, మహేష్ గౌడ్, మరియు టీఆర్ఎస్ సినీయర్ నాయకులు భీమాగౌడ్, శ్రీ ధర్, తడక రవి, కాంపెల్లి రాజం, తదితరులు పాల్గొన్నారు.