మహేంద్ర సంఘం మండల కమిటీ ఎన్నిక

Published: Wednesday May 11, 2022
జన్నారం రూరల్, మే 10, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో గడిచిన నాలుగు రోజుల క్రితం అరువ తారీకు రోజున మహేంద్ర సంఘంలో అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులను ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ప్రచార కార్యదర్శి పోస్టులను ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు, నేడు మంగళవారం పూర్తిస్థాయి లో మహేంద్ర సంఘం నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, నూతన కమిటీ సభ్యులు జన్నారం మండల మహేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు సూరనేని కొండయ్య, అధ్యక్షుడు ఎం ఆర్ నర్సింగరావు, ఉపాధ్యక్షులుగా చిలువేరు నర్సయ్య, పిల్లి నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా కోడిజుట్టు రాజన్న, కార్యదర్శులుగా పర్ల కనకయ్య, సంధ గోపాల్, ఓడిపెళ్లి పెద్ద మల్లేష్, కోశాధికారిగా పిల్లి మల్లయ్య, ప్రచార కార్యదర్శిగా ఓడిపల్లి రామయ్య, సంయుక్త కార్యదర్శులుగా వేముల నర్సయ్య, పిళ్లి అంజయ్య, నగురు మహేందర్, న్యాయ సలహాదారులుగా నగురు రవీందర్, సలహాదారులుగా కనికరపు అశోక్, డైరెక్టర్లుగా ఒడిపెళ్లి అంజయ్య, సూర నేని సత్తయ్య, చింత ఎల్లయ్య, నీలా మధు లను ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో జన్నారం మండలం మహేంద్ర సంఘం నాయకులు, మహేంద్ర యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.