వైయస్సార్ షర్మిల ఆదేశాల మేరకు గ్రామాలలో పర్యటన

Published: Friday July 02, 2021
పరిగి 1 జూలై ప్రజా పలన ప్రతినిధి : వైయస్ ఆర్ షర్మిల ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో (వైయస్సార్ సి పీ) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోళ్ల యాదయ్య, ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా. పరిగి మండలo నస్కల్ గ్రామంలో రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రాశుక్రాంతి కింద ఆవులు బర్రెలు ఎడ్ల బండ్లు వచ్చాయి అనే ఒకే సారి రుణ మాపి అయిందని మాట్లాడారు. రైతులు మాట్లాడుతూ గ్రామంలో వైస్సార్ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేదని  ఇంటికో ఉద్యోగమన్నా కేసీఆర్ వల్ల ఇంట్లో మాత్రం ఉద్యోగాలు వచ్చాయి నిరుద్యోగులు మాత్రం అలాగే ఉండీ పోయారని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిందేమి లేదు అని రైతులు ఆవేదన వక్తం చేశారు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని షర్మిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మనకు మంచి రోజులు వచ్చే రోజులు... దగ్గరలో ఉన్నాయని షర్మిలమ్మ మనకు అండగా ఉంటుందని, నిరుద్యోగులక మహిళలకు రైతులకు మనోదర్యాన్ని కల్పిస్తూ గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అడాక్ కమిటీ మెంబర్ నరేందర్ పరిగి మండల అధ్యక్షులు జాకబ్. పుడూర్ మండలాధ్యక్షులు యాదగిరి నరేందర్ రెడ్డి చెంద్రయ్య రాములు రత్నం వినోద్ మహేష్ రామయ్య నగేష్ రాంచెంద్రయ్య  గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.