కేసీఆర్ ద్వారానే వీఆర్ఏల సమస్యలు పరిష్కారం..

Published: Thursday September 15, 2022
తెరాస జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి..
తల్లాడ, సెప్టెంబర్ 14 (ప్రజాపాలన న్యూస్):
టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ పార్టీ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు తల్లాడలో చేస్తున్న నిరాహార దీక్షకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే వీఆర్ఏల సంఘ నాయకులతో చర్చలు జరుపుతుందని, సకాలంలోనే సుముఖమైన తీర్పు వస్తుందని వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు దుండేటి  వీరారెడ్డి, వీఆర్ఏలు పాల్గొన్నారు.