ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరికలు

Published: Monday October 10, 2022
మేడిపల్లి, అక్టోబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక సందర్బంగా  టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దుతుగా చౌటుప్పల్ మండలం పరిధిలోని అరెగూడెం  గ్రామానికి చెందిన 100మంది యువకులు ప్రభుత్వ అబివృద్ధి,సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ,బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరగా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉపాధి & కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి, హుజూర్ నగర్ శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ ఎన్నికల ఇంచార్జి పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటి మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,సీనియర్ నాయకులు పప్పుల అంజి రెడ్డి,అరెగూడెం సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి వీరి వెంట,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు,పార్టీ నేతలు మరియు మహిళలు,గ్రామం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.