మధిర మునిసిపల్ పరిధి లో పలు వార్డు లలో మునిసిపల్ ఇంచార్జి కమిషనర్ ఇన్స్పెక్షన్

Published: Monday May 17, 2021
మధిర, మే16, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మునిసిపల్ పరిధి లో 13 వ వార్డు లో జ్వరం సర్వే లో భాగం గా జరుగుతున్న సర్వే కార్యకమాన్ని మునిసిపల్ ఇంచార్జి కమిషనర్ ఇన్స్పెక్షన్ చేసి ఆక్సిజన్ లెవల్స్ ను చెక్ చేసి పోసిటివ్ వచ్చిన వారికి పలు జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ప్రజలందరూ ఈ సమయం లో తగు జాగ్రత్తలు వహించాలి అని, కరోన ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లో ఆశా వర్కర్ రజిని, మెప్మా Rp రోజా, ఇంచార్జి గోపినాధ్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.