ఎంపీపీ గంగారాం గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవితక్క

Published: Wednesday June 02, 2021
జగిత్యాల, జాన్ 01, (ప్రజాపాలన ప్రతినిధి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తో కలసి ఇటీవల కరోనాతో పోరాడి మరణించిన జగిత్యాల రూరల్ ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్ చలిగల్ గ్రామంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎంపీపీగా ప్రజాసమస్యల పరిష్కారానికై పనిచేసిన వ్యక్తిని కరోనా కాటేయడం భాధాకరమని పార్టీ కోసం నిబద్దతతో పనిచేసిన వ్యక్తి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గంగారం గౌడ్ మృతితో మంచి ఆత్మీయున్ని కోల్పోయానని తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రావు ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేష్ సర్పంచ్ ఎల్ల గంగానర్సు రాజన్న మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మహేష్ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.