శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
శంకరపట్నం డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
శంకరపట్నం మండల కేంద్రంలోని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.మండలంలోని కేశవపట్నం గొల్లపల్లి కొత్తగట్టు కల్వల నూతనంగా నియమించబడిన రేషన్ డీలర్ల రేషన్ షాపులను పునః ప్రారంభించారు.
అనంతరం కలవల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని ఉన్నత విద్యల్లో యువకులు చదువే ధ్యేయంగా ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్న శిఖరాలు అధిరోహించాలని ఆయన అభిప్రాయపడ్డాడు ఆయన ఉన్నత చదువుల కోసం యువకులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేసినాడు అని ఆయన తెలిపాడు అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని తను కూడా పీహెచ్డీ లో గోల్డ్ మెడల్ సాధించానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ ఉమ్మేంతుల సరోజన, వైస్ ఎంపీపీ పులికోట రమేష్ ,కల్వల గ్రామ సర్పంచ్ దాసర భద్రయ్య,సర్పంచులు మానస ,అనూష దళిత సంఘ నాయకులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు
Share this on your social network: