టిఆర్ఎస్ పట్టభద్రుల అభ్యర్థి సురభి వాణి దేవిని గెలిపించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మ

Published: Wednesday March 03, 2021

వికారాబాద్ జిల్లా మార్చ్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి ) : టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి సురభి వాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఏపి కళాశాల గ్రౌండ్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ చేస్తూ టిఆర్ఎస్ అభ్యర్థికే మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని కోరారు. వికారాబాద్ బస్ డిపోలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సహకరించాలని అడిగారు. విశ్వభారతి కళాశాలలోని అధ్యాపకులతో సమావేశమై పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఏకెఆర్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకుడు బివి రమణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 300 మంది నిరుద్యోగ యువతతో సమావేశం అయ్యారు. టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఉన్నత విద్యాకుటుంబం నుండి వచ్చిన వ్యక్తి మాజీ ప్రధాని పివి నర్సింహారావు కుమార్తె సురభి వాణి దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.