చిల్కానగర్లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
Published: Thursday April 06, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి)
స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను చిల్కానగర్లో ఘనంగా నిర్వహించారు. చిల్కానగర్ డివిజన్ షెడ్యూల్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా చిల్కానగర్ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహనికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సేవా సంఘం ప్రతినిధులు పల్లె నర్సింగరావు, అంజన్ కుమార్, యాదగిరి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: