డిసెంబర్ 3న సిఐటియు జిల్లా ప్రథమ మహాసభ ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ **

Published: Monday November 28, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 27 (ప్రజాపాలన, ప్రతినిధి) : వచ్చేనెల 3వ తేదీన జరిగే సిఐటియు జిల్లా మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శి అల్లూరి లోకేష్, ముంజం శ్రీనివాస్ లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చేనెల డిసెంబర్ 3వ తేదీన జరిగే సిఐటియు ప్రథమ మహాసభలకు జిల్లావ్యాప్తంగా ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల జీవోలను అమలు చేయాలని, అసంఘటితంగా కార్మికులకు వెల్ఫేర్ బోర్డులు  ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారం కోసం క్షుణంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు మన్యం ఆనంద్ కుమార్, అంబాల ఓదెలు, రాజేందర్ తదితరులు ఉన్నారు.