చర్చి నిర్మాణానికి 20వేలు అందించిన మాజీ ఎంపీ పొంగులేటి..
Published: Monday March 28, 2022
తల్లాడ, మార్చి 27 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్సీఎం చర్చి నిర్మాణానికి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఆర్థిక సాయం అందించారు. ఆలయ నిర్మాణానికి గ్రామ ఎస్సీ కాలనీ యువకులు మల్లవరం ఉప సర్పంచ్ ఎర్రి నరసింహారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయాన్ని నర్సింహారావు పొంగులేటికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన చర్చి నిర్మాణానికి 20వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆర్థికసాయం అందించిన పొంగులేటికి ఉప సర్పంచ్ తో పాటు యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడి రామారావు, మేడి నాగబాబు, అద్దంకి నరసింహారావు, పింగళి హరికృష్ణ పాల్గొన్నారు.
Share this on your social network: