ఇబ్రహీంపట్నం జూన్ తేది 13 ప్రజాపాలన ప్రతినిధి.
అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ మల్లికార్జున భ్రమరాంబ కేతమ్మ ల కళ్యాణ మహోత్సవం
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి అనుబంధ గ్రామమైన మాన్యగూడ లో శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండే కాక వివిధ మండలాల నుంచి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అశేష జనం రావడం జరిగింది. అందరి సమక్షంలో కల్యాణ మహోత్సవం మల్లికార్జునుడు గత సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవానికి భక్తి శ్రద్ధలతో టి మల్లికార్జున స్వామి ఆశీర్వాద నిమిత్తం ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. యాదవ కురుమ సంఘం ఆలయ కమిటీ సభ్యులు, కుల పెద్దలు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎల్లవేళలా మల్లికార్జున స్వామి కృపా కటాక్షములు దీవించే విధంగా ప్రజలందరిని చూడాలని ఆలయ కమిటీ వేడుక ఉన్నట్లు తెలిపారు.
Share this on your social network: