గాయత్రి గోశాలకు ఆర్థికం సహాయం చేసిన మూటపల్లి గ్రామయూత్

Published: Monday February 20, 2023

రాయికల్, ఫిబ్రవరి 19 (ప్రజాపాలనప్రతినిధి): రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని గాయత్రి గోశాల కు మూటపల్లి గ్రామానికి చెందిన జవాన్ యూత్ సోదరులు గోవుల(గోమాత) గ్రాసఅవసరాల నిమిత్తం 21000/- రూ: ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుమ్మరిపల్లి గ్రామవాసులు జమాన్ యూత్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు సామర్ల బుచ్చన్న కమలాకర్, గంగాధర్ గ్రామసర్పంచ్, ఎంపీటీసీ దొంతి నాగరాజు, యూత్ సభ్యులు అర్జున్, రమేష్, వేణు, సతీష్, రాజేందర్, శంకర్, నరసయ్య, కృష్ణ, రాజన్న, శ్రీనివాస్, అశోక్ ,శేఖర్ పాల్గొన్నారు.