ఆర్అండ్ బి అధికారులు నిర్లక్ష్యం విడాలి * -శంకర్పల్లి పట్టణంలో రోడ్ల మరమ్మత్తుల పనులు వెంటన

Published: Wednesday February 22, 2023

-సిపిఎం పార్టీ చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్.
చేవెళ్ల ఫిబ్రవరి 21,(ప్రజాపాలన):-


హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న శంకరపల్లి పట్టణ కేంద్రంలో రోడ్లు చాలా అద్వాన స్థితిలో ఉన్నాయని సిపిఎం పార్టీ చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్ అన్నారు.
ముఖ్యంగా ఇంద్రారెడ్డి విగ్రహం దగ్గర నుంచి ఫతేపూర్ గేటు వరకు రోడ్డు పూర్తిగా గుంతల మయం అయిందని ఆ గుంతల నుంచి భారీ వాహనాల వెళ్లడం ద్వారా
దుమ్ము దూళ్లి తో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ఆ గుంతలలో వాహనాలు పడి వాహనాలు దెబ్బతింటున్నాయని,అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ నెలలోనే ఒక మహిళా రోడ్డు ప్రమాదం లో చనిపోవడం జరిగిందని అన్నారు. కాబట్టి శంకర్పల్లి పట్టణ ప్రజా ప్రతినిధులు ఆర్ అండ్ బి అధికారులు మొద్దు నిద్ర విడాలని,ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు ప్రారంభించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.