పద్మశాలి సంఘం జెండా ఆవిష్కరణ

Published: Tuesday February 16, 2021

జన్నారం, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: మండల కేంద్రంలో గల మార్కండేయ ఆలయంలో మార్కండేయ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జెండా ఆవిష్కరించారు. పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు చెట్టు పల్లి గంగన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సారంగపాణి చిరంజీవి వీరయ్య సత్యం దశరథం లక్ష్మీనారాయణ మధు తదితరులు పాల్గొన్నారు.