వర్షంలో సూర్యనమస్కరములు

Published: Thursday January 13, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 13, ప్రజాపాలన : 75 కోట్ల సూర్యనామస్కరాలలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో ని ప్లే గ్రౌండ్ లో వర్షంలో సైతం సూర్యనమస్కరములు చేశారు. ఐతే జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల నందు ఓం అష్టోత్తర యోగా పీఠ్ ఆధ్వర్యంలో గురుజీ గుండా విజయ్ కుమార్, అధ్యక్షుడు ముక్త వేణుగోపాల్, అధ్యక్షతన ప్రధానకార్యదర్శి కోడూరి శ్రీనివాస్, ఓం అష్టోత్తర యోగ పీఠ్ సభ్యుల ఆధ్వర్యంలో నిత్యము యోగా తరగతులు నిర్వహించబడుతున్నవి.  భారత దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను పురస్కరిం చుకుని జనవరి 1 నుండి ఫిబ్రవరి 7 వరకు, చేపట్టిన 75 కోట్ల సూర్యనా మస్కారాలలో బాగానే బుధవారం వర్షంలో సైతం సూర్యనమస్కరములు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.